[1]శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి (AJTA)

శ్రీరామనవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం[2] వారిచే లోకార్పణం చేయబడిన చిన్న పుస్తకం ఇది. హనుమంతుడు పుట్టిన స్థలం అంజనాద్రి తిరుమలలో ఉన్నది అని ఐతిహాసిక మరియు పురాణగ్రంథముల ఆధారముగా ? ముద్రించిన పుస్తకం ఇది.

AJTA పత్రసంఖ్య 1. మొదటి పత్రము

1.హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు అను మొదటి వాక్యమే చాలా విలక్షణమైనది. హనుమంతుడు సర్వదేవతాస్వరూపుడైనచో ఆతను శ్రీరామస్వరూపుడు అగును కదా? మరి హనుమంతుడు శ్రీరాముడి దాసుడిగా ప్రసిద్ధి ఎలా పొందాడు ? ఇప్పటికీ కింపురుష ఖండమునందు శ్రీరాముని భజన నామజపము ఎందుకు చేస్తున్నాడో? ఇలా చాలా సందేహాలు.

AJTA పత్రసంఖ్య 1 రెండవ పుటము

ఈ విధముగా అభయాంజనేయునిగా, ఆనందాంజనేయునిగా హనుమంతుడిని వర్ణించడం జరిగింది. దీనికి తగిన కారణములు—

1.    భయగ్రస్తుడైన సుగ్రీవునికి అభయమునిచ్చి, శ్రీరామచంద్రునితో మైత్రిగావించడం వలన అభయాంజనేయునిగా ప్రసిద్ధిగాంచాడు.

2.మహాదుఃఖమునందున్న సీతామాతకు శ్రీరాముని సందేశమును అందజేసి, సీతాప్రాణదాతగా, మాతకు మహదానందమును అందజేసినకారణముగా ఈతనికి ఆనందాంజనేయ అను నామము సార్థకమైనది.

ఇక్కడ గమనించవలసిన విషయము ఏమనగా సుగ్రీవుడికి అభయమునొసంగినది శ్రీరాముడే కాని హనుమంతుడు కాదు. హనుమంతుడు ఉత్తమ మంత్రిగా సుగ్రీవుడికి మంచి సలహా ఇచ్చి, పురుషోత్తముడైన ఆ శ్రీరామచంద్రుని అభయము సుగ్రీవుడికి అందించాడు అంతే. కాకపోతే శ్రీరామచంద్రుని పరమభక్తుడైన హనుమంతుడు సకలవిధములైన సంకటములను తొలగించి, మనకు రక్షణకల్పించగలడు కాబట్టి ఈతనికి అభయాంజనేయ అను నామము వచ్చి ఉండవచ్చు అను వివరణ ఇక్కడ ఉచితమని చెప్పవచ్చు.

అలాగే మహాదుఃఖమునందున్న సీతామాతకు రాముని సందేశమును అందించినవాడు హనుమంతుడు అనునది సామాన్యజనులకు సందేహమును కలిగించు మాట. ఎందువలనా అనగా అక్కడ లంకలో ఉన్నది సీతాకృతిని దాల్చిన వేదవతి, అంతేకాని సాక్షాత్తు సీతామాత కాదు. ఈవిషయము శ్రీవేంకటేశమాహాత్మ్యము అను గ్రంథమును శోధించిన టి.టి.డి వారికి  తెలియకపోయినదా ? విమర్శకులు ఇటువంటి సూక్ష్మాంశములను గమనించగలరు. జనులను కేవలం భావనాత్మకముగా వంచించడం సరికాదు. అలా చేసిన అది సినిమా, లేదా చందమామ కథ అవునే కాని, ఎన్నడూ వాస్తవము కాదు. అలాగే పురాణ మరియు ఇతిహాసము కానేరదు.

అంతేకాదు ఏదైనా పురాణవాక్యములను, వెనక ముందు జరిగిన సంభాషణ చూసి ఆలోచించి అర్థము చేసుకోవాలి, మనకు కావలసిన అంశమును మాత్రమే తీసుకొని ఉల్లేఖించడం ద్వారా అది అనర్థదాయకమే అగును అది ఎన్నడూ సత్యాంశమును తెలియజెప్పలేదు.

అంజనా ఎవరు ? తనయందు హనుమంతుడు ఎలా జన్మించాడు ?

TTD వారు తమకు ఎంతవరకు కావాలో, ఆ అంశమును మాత్రమే తీసుకొని అక్కడక్కడ దొరకిన కొన్ని పురాణవాక్యములను సేకరించి ఈ విధమైన ఉల్లేఖము చేశారు. వీటియందున్న సత్యాసత్యముల, మరియు యుక్త్యయుక్తుల గూర్చిన చర్చ జరపడంలో విఫలం కావడం జరిగింది. ఇప్పుడు తి.తి.దే వారు ఉల్లేఖించిన పురాణముల మరియు ఇతిహాసము కథలను ఒక్కొక్కటిగా  పరిశీలించి, వాటియందున్న ఉచితానుచితములను  పరిశీలిద్దాం-

1.   రామాయణంలో చెప్పిన అంశములను పరిశీలిద్దాం[3]

పార్వతీపరమేశ్వరులు కైలాసపర్వతమునందు ఆనందక్రీడలో ఉన్నపుడు వారికంటికి ఒక వానరజంట కనబడుతుంది. పార్వతి శివునితో కలిసి గర్భమును ధరించి, భారమును తాళలేక శివుడిని ప్రార్థించెను. అపుడు మహాదేవుడు పార్వతీ నాభిదేశమునుండి ఆ వీర్యము బయటకు వచ్చునట్లు చేసేను. ఆవిధముగా ఆవీర్యము భూమిమీద పడినతరువాత భూదేవి దానిని భరించలేక అవస్థపడుచున్నప్పుడు, అదే సమయమునందు గౌతముడియోక్క పుత్రిక అయిన అంజనా పుత్రాపేక్షచేత ఘోర తపస్సును చేయుచుండెను. అప్పుడు వాయుదేవుడు ఆమె సౌందర్యానికి మగ్నుడై, ఆ భూమిమీద పడిన శివతేజస్సును అంజనా చేతియందు వుంచెను. ఆమె దానిని సంపూర్ణముగా స్వీకరించెను. అనంతరము నవమాసములు నిండిన తరువాత సకలాభరణభూషితుడైన ఒక కుమారుడు జన్మించెను. ఈ విధముగా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ బాలుడు ఫలము అని భ్రమించి సాక్షాత్ సూర్యుడినే మింగుటకు ఆకాశమునకు ఎగిరెను. ఆ బాలుడిని నిలువరించుట కొరకు చివరిగా ఇంద్రుడు తన వజ్రాయుధమును ఉపయోగించెను. ఆ వజ్రాయుధప్రహారముచే మూర్ఛనొందిన ఆ బాలుని వద్దకు సకలదేవతలు వచ్చి తనకు అనేకానేకవరములను ఒసంగి, అనుగ్రహించిరి. తదనంతరం ఆ బాలుడు సూర్యుని వద్దనే తన అధ్యయమును పూర్తి చేసి సుగ్రీవునికి మంత్రిగా వ్యవహరించెను. (తత్త్వసం.రా.కి -----)

[4]వాల్మీకి రామాయణం ప్రకారం---

జాంబవంతుడు హనుమంతుడికి తన జన్మరహస్యమును అలాగే తన బలపరాక్రమముల గురించి వివరిస్తాడు. అప్సరసలలో అత్యంత శ్రేష్ఠురాలైన పుంజికాస్థలా అను నారీ జన్మాంతరమునందు శాపవశాత్ అంజనా అను పేరుతో కుంజర అనువానరశ్రేష్ఠునకు కుమార్తెగా జన్మించెను. తదనంతర కేసరికి పత్ని అయెను. కామరూపిణియైన ఈమె ఒకనాడు సర్వాభరణభూషితురాలై సుందరమైన వస్త్రములను ధరించి మానవరూపముతో పర్వతశిఖరమునందు సంచరించుచుండెను. ఆ సమయమున ఆమె రూపలావణ్యానికి ముగ్ధుడైన వాయుదేవుడు తనను గట్టిగా ఆలింగించెను. అప్పుడు అంజనా భయచికితురాలై ఏకపత్నీవ్రతమునందున్న నన్ను ఎవరు ఈ విధముగా ఇబ్బంది పెట్టింది అని ఆగ్రహించగా, అప్పుడు వాయుదేవుడు ఆమెను సమాధానపరచి, దేవి యశోమూర్తివైన నిన్ను నేను ఆలింగనం చేసి నీలో ప్రవేశించాను. నీకు పుట్టబోవు కుమారుడు, బుద్దిమంతుడు, మహాతేజస్వి, ఓజస్వి, అన్నివిషయములయందు నాకు సమానుడగును అని ఆశీర్వదించగా, అపుడు నీ తల్లి అంజనా శాంతమును వహించెను. తరువాత కొంత కాలానికి వాయుదేవుని అనుగ్రహముతో అద్భుతమైన పుత్రుడిగా నిన్ను పొందెను. నీవు బాల్యావస్థయందే సూర్యుడిని మింగుటకు వెళ్లినపుడు ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము వలన నీయెక్క ఎడభాగమున హనువు అనగా గాయము అయినది, కావున ఆ నాటి నుండి జనులు నిన్ను హనుమంతుడిగా వ్యవహరిస్తున్నారు. నీ మీద వజ్రాయధాన్ని ప్రయోగించడం వలన  కుపితుడైన నీ తండ్రి వాయుదేవుడు ముల్లోకాలను స్తంభింపజేశాడు. కంపుతులైన సకల దేవతలు వాయుదేవుడిని ప్రార్థించి ప్రసన్నము గావించిరి. వాయుదేవుని ఇచ్ఛవలన చతుర్ముఖ బ్రహ్మ నీకు అమోఘమైన వరమును ప్రసాదించెను, అది ఏమనగా- యుద్దసమయునందు ఏ అస్త్రము వలన నీకు ఆపద కలుగకుండునట్టు, అలాగే ఇంద్రుడు నీవు కోరుకున్నప్పుడు మృత్యువు నీ సమీపమునకు వచ్చునట్టు వరములను అనుగ్రహించిరి.

హనుమంతుడు తనను పరిచయం చేసుకున్న క్రమము (సుందరకాండము)

[5]వైదేహి! మాల్యవంతము అన్ని పర్వతములలో కన్నా శ్రేష్ఠమైన పర్వతము. కేసరి అను కపీశ్వరుడు అక్కడ నుండి గోకర్ణపర్వతమునకు పయనమాయను. పుణ్యప్రదమైన గోకర్ణక్షేత్రమునందు భక్తులకు ఇబ్బందిని కలిగిస్తున్న, శంబసాధన అను రాక్షసుడిని వధించమని నా తండ్రిని బ్రహ్మర్షులు ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరసావహించి నా తండ్రి ఆ రాక్షసుడిని సంహరించాడు. అటువంటి మహాపరాక్రమశాలియైన కేసరివలన ఆతని పత్నియైన అంజనా గర్భమునందు వాయుదేవుని వరప్రసాదిగా నేను జన్నించితిని. నా పరాక్రమముచేత నేను ఈ లోకమునందు హనుమంతుడిగా ఖ్యాతి గాంచితిని.

మరియొక పురాణకథను పరిశీలిస్తే---

విష్ణువుయోక్క మోహినీ రూపమును చూసి పరమశివుని మనస్సు చలించి ఆతని తేజస్సు స్ఖలితమవగా, సప్తర్షులు అందరూ కలిసి ఆ శివతేజస్సుని ఒక ఆకుయందు ఉంచిరి. అనంతరము తదుపరి కార్యాచరణ కొరకు వారు ఆ తేజస్సుని అంజనా గర్భమునందు ఉంచిరి. ఆ పరమశివుడే ఆంజనేయునిగా అంజనాగర్భమునందు అవతరించెను. తదుపరి సూర్యుడిని మింగడం, వజ్రాయుధప్రహారము, సకలదేవతల వరప్రదానం, సూర్యుని వద్ద విద్యాభ్యాసం, సుగ్రీవునికి మంత్రిగా ఉండడం మొదలైన కథ యథాక్రమముగా వివరించడం జరిగినది. (శివ. పు. శతరుద్ర 10[6])

4. మరియోక పురాణము నందు---

అంజనా అహల్యా, గౌతముల పుత్రికా. అహల్యా ఇంద్రుని వలన, మరియు సూర్యుని వలన రహస్యముగా ఒక్కొక్క కుమారుని పొందెను. ఒకనాడు గౌతముడు ఆ ఇద్దరు సంతానముతో ఉన్న అంజనాతో కలిసి సముద్రతీరమునందు సంచరిస్తున్నపుడు, అపుడు అంజనా ఆ ఇద్దరి పుత్రులయోక్క రహస్యమును తండ్రికి వివరించగా, కోపోద్రిక్తుడైన గౌతముడు ఆ ఇద్దరు కుమారులని వానరముఖముగలవారిగా మారమని శపించెను. వారే వాలి, మరియు సుగ్రీవుడు. గుట్టుని రట్టు చేసినందువలన కోపవశరాలైన అహల్య అంజనను శపించెను. నీ గర్భమునందు కూడా కపియే జన్మించుగాక అని, ఆవిధముగా అంజనా గర్భమున భవిష్యత్ కాలమునందు ఆంజనేయుడు కపిరూపమున జన్మించెను. (వచనవిచిత్ర రామాయణము) ఇవన్నీ కూడా వేంకటాచలమాహాత్మ్యమునకు సంబంధించిన ఆంజనేయ, మరియు, హనుమంతుడికి సంబంధించి జరిగిన కథా ప్రసంగములు.

TTD వారి పురాణములు

వేంకటాచలమాహాత్మ్యము అని ప్రసిద్ధిగాంచిన కొన్ని పురాణభాగములను పరిశీలిద్దాం. తి.తి.దే వారిచే ప్రచురించబడిన వేంకటాచలమాహాత్మ్యము అను పురాణకథల ఆధారమున AJTA అను చిన్న సంకలనము రచించబడినది. దానియందు తి.తి.దే వారు చెప్పినట్లు స్కాంద, వరాహ, బ్రహ్మాండ, మొదలైన 18 పురాణములయందు వేంకటాచలముయొక్క ప్రస్తావన ఉన్నట్టుగా వారు ఉదాహరించి యున్నారు.

1.   బ్రహ్మాండ పురాణము ? (AJTA పత్రసంఖ్య 4 మరియు 5)

अञ्जनाद्रिर्वृषाद्रिश्च शेषाद्रिर्गरुडाचलः। तीर्थाद्रिः श्रीनिवासाद्रिश्चिन्तामणिगिरिस्तथा।। 21।।

वृषभाद्रिर्वराहाद्रिर्ज्ञानाद्रिः कनकाचलः। आनन्दाद्रिश्च नीलाद्रिः सुमेरुशिखराचलः।। 22।।

वेङ्कटाद्रिः पुष्कराद्रिरिति नामानि विंशतिः। वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन।। 24।।

वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति।।

(ब्रह्माण्ड.पु. वेङ्कटाचलमाहात्म्यम् तीर्थखण्ड.अ.1)

ఈ ప్రమాణముచే శ్రీనివాసుని క్షేత్రమైన వేంకటాద్రిని 1. అంజనాద్రి 2.వృషాద్రి. 3.శేషాద్రి 4.గరుడాచల 5.తీర్థాద్రి 6.శ్రీనివాసాద్రి 7.చింతామణిగిరి 8.వృషభాద్రి 9.వరాహాద్రి  10.జ్ఞానాద్రి 11.కనకాచల 12.ఆనందాద్రి 13. నీలాద్రి 14.సుమేరుశిఖరాచల 15.వైకుంఠాద్రి 16.పుష్కరాద్రి మొదలైన నామములతో పిలవడం జరుగుతున్నది.

అంజనా తపస్సుఫలముగా ఆంజనేయుడు జన్మించిన స్థలము కాబట్టి అంజనాద్రి అని త్రేతాయుగము నుండి ప్రసిద్ధిగాంచినది. కాబట్టే వ్యాసభగవానుడు ఈ పర్వతమును కృతయుగమునందు వృషాద్రి అని, త్రేతాయుగమునందు అంజనాచలము అని, ద్వాపరమున శేషశైలము అని, కలియుగమున శ్రీవేంకటచాలమని కీర్తించడం జరిగినది.

कृते वृषाद्रिं वक्ष्यन्ति त्रेतायामञ्जनाचलम्।

द्वापरे शेषशैलेति कलौ श्रीवेङ्कटालम्।।

अञ्जना च तपः कृत्वा हनूमन्तमजीजनत्।

यस्मात् पुत्रम् असूत सा जगुः तस्मात् इमं गिरिम्।।

అంజనా ఈ పర్వతము నందు పుత్రుడిని పొందిన కారణముగా దీనికి అంజనాద్రి అను పేరు వచ్చినది.

अञ्जने! त्वं हि शेषाद्रौ तपस्तप्त्वा सुदारुणम्।

पुत्रं सूतवती यस्मात् लोकत्रयहिताय वै।।

(ब्रह्माण्ड.पु. वेङ्कटाचलमाहात्म्यम्. तीर्थखण्ड. अ. 5-64)

ఓ అంజనాదేవి, నీవు ఈ శేషాచలపర్వతమునందు తీవ్రమైన తపస్సు చేసి సంతతిని పొందితివి. కావున ఈ తపస్సు మూడు లోకములను రక్షించు మహిమ పొందినది. కావున  अञ्जनाचल इत्येव नात्र कार्या विचारणा। प्रसिद्धिं यातु शैलोऽयं अञ्जने नामतस्तव।।

(ब्र.पु. वेङ्कटाचलमाहात्म्यम् तीर्थखण्ड अ.5-65)

ఈ పర్వతము యొక్క మహిమను చెబుతూ- హే అంజనా, నీవు తపస్సు చేసి ఈ పర్వతమును మరింత శోభను చేకూర్చితివి. మహామహిమాన్వితుడైన పుత్రుడిని పొందితివి. కాబట్టి ఈ పర్వతము నీ పేరుతో ప్రసిద్ధికాగలదు. ఈ విషయమునందు సందేహము వలదు, అని దేవతలు ప్రశంసించిరి.

AJTA పత్రసంఖ్య 4 మరియు 5 (విమర్శ)

వాస్తవానికి అనేక పురాణములను పరిశీలించగా, స్కాంద, భవిష్యోత్తర, ఆదిత్య పురాణముల పేర్లతో వేంకటాచలమాహాత్మ్యము ఉపలబ్ధి అగుచున్నది. భవిష్యోత్తర పురాణకథగా ప్రసిద్ధిగాంచిన ప్రాచీన కథ ఒకటి ప్రాయః వైశాఖ మరియు ఆశ్వయుజమాసములలో సర్వత్ర పఠనము మరియు శ్రవణము గావించు పద్ధతి ఉన్నది. కాబట్టి వేంకటాచలమాహాత్మ్యమును తప్పకుండా ఆదరించవలెను, అంతేకాని దానిని విపరీతార్థములో వాడుట తప్పు. వ్యాసభగవానుడు రచించిన 18 పురాణములయందు ప్రాయః ఇంతకముందు పరిశీలించిన ప్రాచీన తాళపత్రములయందు ఎక్కడా వేంకటాచలమాహాత్మ్యము యొక్క ఉల్లేఖము లేదు. కాబట్టి దేనిని ఎంతవరకు స్వీకరించాలి, ఏది ప్రమాణము కాగలదు అని తెలుసుకొనుటకు కొన్ని ఉపాయములను అనుసరించాలి. మహాపురాణములయందు ఈ విధముగా అనేక కథలను జోడించడే క్రమము చాలా కాలము నుండి వస్తున్నది. కాబట్టి దీని గురించి ప్రత్యేకమైన విమర్శ చేయడం తప్పనిసరి. దీని గురించి నా ప్రత్యేక సంచికలో తెలియబరుస్తాను.

ప్రస్తుతం పైన చెప్పిన (బ్రహ్మాండ పురాణము అని చెప్పబడిన) శ్లోకములను వాటి అనువాదమును గమనించండి.

1.            अञ्जनाद्रिर्वृषाद्रिश्च शेषाद्रिर्गरुडाचलः। तीर्थाद्रिः श्रीनिवासाद्रिश्चिन्तामणिगिरिस्तथा।।

वृषभाद्रिर्वराहाद्रिर्ज्ञानाद्रिः कनकाचलः। आनन्दाद्रिश्च नीलाद्रिः सुमेरुशिखराचलः।। 22।। वेङ्कटाद्रिः पुष्कराद्रिरिति नामानि विंशतिः।

1. అంజనాద్రి 2.వృషాద్రి. 3.శేషాద్రి 4.గరుడాచల 5.తీర్థాద్రి 6.శ్రీనివాసాద్రి 7.చింతామణిగిరి 8.వృషభాద్రి 9.వరాహాద్రి  10.జ్ఞానాద్రి 11.కనకాచల 12.ఆనందాద్రి 13. నీలాద్రి 14.సుమేరుశిఖరాచల 15.వైకుంఠాద్రి 16.పుష్కరాద్రి మొదలైన ఇరవై పర్వతముల పేర్లు ఉల్లేఖించబడినవి. కాని ఇక్కడ చెప్పినవి 16 పర్వతముల నామములు మాత్రమే తి.తి.దే వారు ఈ విషయమును గమినంచారో లేదో తెలియదు మరి.

2. कृते वृषाद्रिं वक्ष्यन्ति त्रेतायामञ्जनाचलम्। द्वापरे शेषशैलेति कलौ श्रीवेङ्कटालम्।।

ఇది వ్యాసమహర్షియొక్క రచన అని అన్నారు. ఇక్కడ ఉల్లేఖించిన వృషాద్రి, మరియు వృషభాద్రి ఒకటేనా, లేక వేరు వేరుగా ఉన్నాయా, అన్న విషయము తి.తి.దే వారే చెప్పాలి. ఒకవేళ రెండూ ఒకటే అన్న పక్షములో కృతయుగమునందు వృషాద్రి అని చెబుతారా, లేక వృషభాద్రి అని చెబుతారో తి.తి.దే వారే నిర్ణయించాలి కాని వ్యాసులవారి వల్ల కూడా సాధ్యపడదు. పైన ప్రత్యేకముగా రెండిటినీ ఉల్లేఖించడం ఎలా సాధ్యమైనది. అప్పుడు సంఖ్యకూడా 15 అని చెప్పినట్టు అవుతుంది.

3.अञ्जने त्वं हि शेषाद्रौ तपस्तप्त्वा सुदारुणम्। पुत्रं सूतवती यस्मात् लोकत्रयहिताय वै।।

[7]अञ्जनाचल इत्येव नात्र कार्या विचारणा। प्रसिद्धिं यातु शेलोऽयं अञ्जने नामतस्तव।।

(ब्र.पु.वेङ्कचालमाहात्म्यम् तीर्थखण्ड. अ. 5-64)

హే అంజనా, నీవు ముల్లోకముల హితము కొరకు ఈ శేషాచలపర్వతముయందు అత్యంత తీవ్రమైన తపస్సు చేసి, సంతతిని పొందితివి. కావున­­­ ఇక ముందు ఈ శేషాచల పర్వతము నీ పేరుతో ప్రసిద్ధి అగును. ఈ విషయమునందు సందేహము వలదు, అని దేవతలు ఆశీర్వదించిరి. ఇంతవరకు యథాతథముగా అనువాదము.

ఇక్కడ గమనించదగిన విషయము- అంజనాదేవి త్రేతాయుగమున తపస్సు చేసినది. అప్పుడు  పర్వతము పేరు వృషాద్రినో లేక వృషభాద్రినో అయి ఉండాలి. ఆ పర్వతమునకు శేషాద్రి అను పేరు వచ్చినది ద్వాపరము నందు. త్రేతాయుగము అనంతరము ద్వాపరయుగము. మరి దేవతలు అంజనాదేవికి (त्वं हि शेषाद्रौ तपस्तप्त्वा सुदारुणम्) నీవు ఈ శేషపర్వతమునందు అత్యంత తీవ్రమైన తపస్సు చేసి, సంతతిని పొందితివి. అను దేవతల ప్రశంస సరి అయినదేనా.

లేదంటే శ్లోకఛందస్సును కూర్చడం కొరకు వృషాద్రి అథవా వృషభాద్రి అన్న నామమును త్యజించి రాబోవు యుగముయొక్క శేషాద్రి అను పేరును ఉపయోగించి ఉండవచ్చన్న సందేహమును తి.తి.దే వారే తీర్చాలి కాని వ్యాసులవల్ల కూడా శక్యము కాదు.

AJTA పత్రసంఖ్య 6.7.8

బ్రహ్మాండపురాణంలో చెప్పబడిన వృత్తాంతములో కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ విధముగా ఉన్నాయి.

1.    పూర్వము త్రేతాయుగమున కేసరి అను రాక్షసుడు ఉండేను. ఆతడు మహాదేవుడిని గూర్చి తపస్సు చేసినపుడు, శివుడు ప్రత్యక్షమవగా, మహాబలపరాక్రమశాలి అయిన పుత్రుడిని వరముగా ఇవ్వమని ప్రార్ధించగా నీకు ఒక పుత్రిక జన్మించును అని వరమును అనుగ్రహించెను సదాశివుడు. ఆ రాక్షసుడి కూతురే అంజనాదేవి. ఆమె పెరిగి పెద్దిది అయిన తరువాత కేసరి అను నామము గల ఒక వానరవీరుడు అంజనా తండ్రి దగ్గరరు వెళ్లి నీ కుతురుని నాకు ఇచ్చి వివాహము చేయమని అడుగగా, ఆ యువకేసరిని చూసి సంతసించిన రాక్షసకేసరి తన కూతురు అయిన అంజనాదేవిని  ఇచ్చి  వివాహము జరిపించెను. వారికి చాలా కాలము వరకు సంతానం కలుగలేదు. అంజనా అనేకానేక వ్రతములను ఆచరించెను. ఒకనాడు తన ఇంటికి వచ్చిన కొరవంజిని తనకు సంతాన భాగ్యము ఉన్నదా అని ప్రశ్నించగా, అందుకు ఆ కొరవంజి ఈ విధముగా చెప్పెను.

2.   अभीष्टस्तव पुत्रो वै भविष्यति न संशयः।

मा शोकं कुरु कल्याणि धर्मेण मम ते शपे।।

నీ అభీష్టముమేరకు నీకు తప్పకుండా పుత్రప్రాప్తి కానున్నది. సందేహించకు. హే కళ్యాణి దుఃఖించకు (నేను చెప్పేది సత్యము నా వృత్తిపైన ఆన)

3.  श्रीवेङ्कटगिरौ सप्त साहस्रं वत्सरान् पुनः। तपः कुरु ततः पुत्रमवाप्स्यसि सुशोभनम्।।

నీవు సంతతి కొరకు శ్రీవేంకటగిరియందు 7సంవత్సరముల వరకు తపస్సును ఆచరించు. ఆ తపః ప్రభావముచే నీవు మంగళకరమైన సంతానమును పొందెదవు. అని చెప్పి యథామార్గమును ఆ కొరవంజి వెనుతిరిగెను.

4.  अञ्जना चिन्तयन्ती तद्वाक्यं तस्या मनोहरम्। प्रचक्रमे तपश्चर्तुं श्रीवेङ्कटगिरेस्तटे।। आकाशगङ्गा निकटे सिद्धसङ्घनिषेविते। वाय्वाहारान् च वायुं वै समुद्दिश्य सुदारुणम्। तपश्चचार दान्तेयं प्रीणयन्ती व्रतैरिमम्।.

ఆ కొరవంజి యొక్క మనోహరమైన మాటలను విని. తన చెప్పినట్టుగానే అనేకసిద్ధపురుషులకు ఆశ్రయమైన ఆ శ్రీవేంకటగిరలో ఆకాశగంగా సమీపమునందు తపస్సును ప్రారంభించెను. కేవలము వాయుభక్షణము మాత్రమే చేస్తూ, ఇంద్రియములను నిగ్రహించి, వాయుదేవుని గూర్చి తీవ్రమైన తపస్సును ఆచరించెను. [8]సంతుష్టుడైన వాయుదేవుడు రోజుకొక పండును తనకు అనుగ్రహించెను. ఒకనాడు ఆ వాయుదేవుడు శివతేజస్సుతో కూడిన ఫలమును అనుగ్రహించెను.  ఆ ఫలమును భక్షించి అంజనాదేవి గర్భమును దాల్చెను.  అపుడు ఆకాశవాణి ఈ విధముగా చెప్పెను- శివతేజస్సుతో నీయందు జన్మించబోవు పుత్రుడు లోకోత్తరశక్తిసంపన్నుడు. భవిష్యత్తులో లోకకంటకుడైన లంకాపతియైన రావణుడు అను రాక్షసరాజును సంహరించుటకై శ్రీహరి శ్రీరాముడిగా అవతరించినపుడు, ఆ శ్రీరాముడికి సహాయకుడై నీ కుమారుడు జగత్ప్రసిద్ధిని పొందగలడు అని.  

ततो वै दशमे मासि सम्प्राप्ते नलिनेक्षणा। आसूत पुत्रं बलिनमुदयत्यहिमत्विषि।

श्रावणे मासि नक्षत्रे श्रवणे हरिवासरे। कुण्डलोद्भासितं चैव दिव्यमानमिव श्रिया।।

बिभ्राणं वानराणां वै रूपमत्यद्भुतं महत्। रक्तास्यपुच्छमूलं तु सुवर्णसदृशद्युतिम्।।

గర్భమును ధరించిన పదియవమాసమున అంజనాదేవి, శ్రావణమాసమున శ్రవణానక్షత్రయుక్తమైన ద్వాదశీ ప్రథమపాదమున సూర్యోదయమునకు సరిగా మహాబలవంతుడైన కుమారుడికి జన్మనొసంగెను. సుందరమైన కుండలములతో ఎర్రటి కపోలములతో శోభించు, యజ్ఞోపవీతయుతుడైన, అత్యంతప్రకాశముతో దేదీప్యమానముగా విరాజిల్లుతున్న, కౌపీనవస్త్రాలంకృతుడైన అద్భుతమైన వానరరూపమును ధరించిన ఎర్రటి ముఖము, లాంగూలముతో బంగారువర్ణముతో శోభించుచున్న –

अतोऽयं जातमात्रोऽपि नितरान्तु बुभुक्षितः। उदयाचलसंरूढं ददर्श रविमण्डलम्।

नितान्तरक्तवर्णेन फलबुद्धिरभूत्तदा। फलमित्येव मन्वानो रविं भक्षितुमुद्यतः।।

ग्रहीष्यामीति निश्चित्य श्रीवेङ्कटगिरेस्तटे। उदतिष्ठन्महावेगादुदयाचलशेखरम्।।

ग्रहीतुमुद्यते तस्मिन् बिम्बं सूर्यस्य तद्बलात्। हाहाकृतमभूत्सर्वं जगत्स्थावरजङ्गमम्।।

ఆంజనేయుడు  పుట్టిన క్షణమాత్రములోనే క్షుద్భాధచే ఉదయిస్తున్న సూర్యమండలమును  ఫలముగా భావించి తినుటకు, శ్రీవేంకటగిరినుండి ఉదయగిరిశిఖరమునకు ఎగిరెను. ఆ బాలుడు తన పరాక్రమముతో సూర్యబింబమును ఆరగించుటకు ఉపక్రమించినపుడు సకల స్థావరజంగమాత్మకమైన ప్రపంచమంతయూ హాహాకారమొనర్చెను.

अञ्जने त्वं हि शेषाद्रौ तपस्तप्त्वा सुदारुणम्। पुत्रं सूतवती यस्माल्लोकत्रयहिताय वै।

प्रसिद्धिं यातु शैलोऽयमञ्जने नामतस्तव।। अञ्जनाचल इत्येव नात्र कार्या विचारणा।

इति तस्यै वरं दत्वा देवा ब्रह्मपुरोगमाः।। स्वं स्वं स्थानं समुद्दिश्य यथागतमथो ययुः।

अञ्जना पुत्रमादाय श्रीवेङ्कटगिरेस्तटम्। पुनरागम्य सामोदमलञ्चक्रे निजाश्रमम्।।

అపుడు సూర్యబింబము వైపు పయనిస్తున్న ఆ బాలుడిని చూసి అసురుడని భ్రమించి బ్రహ్మదేవుడు ఆతనిపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. ఆ బాలుడు తన వాలముతో ఆ బ్రహ్మాస్త్రమును పక్కకు నెట్టివేసెను. అపుడు దేవతలు వాస్తవసంగతిని ఎరిగి అంజనాదేవిని సాంత్వనపరిచి ఆంజనేయునికి అనేక వరములను ప్రసాదించిరి. అపుడు బ్రహ్మ ఈ విధముగా పలికెను.

ఓ అంజనాదేవి, నీవు మూడు లోకముల హితము కొరకు శేషపర్వతమునందు అత్యంత తీవ్రమైన తపస్సును ఆచరించి. సంతానమును పొందితివి. కాబట్టి ఇక ముందు ఈ వేంకటగిరి అథవా శేషాద్రి పర్వతము నీ పేరుతో అంజనాద్రి అని ప్రసిద్ధి చెందును. ఈ విషయమునందు సందేహము వలదు. అని చెప్పి బ్రహ్మాది దేవతలు ఆశీర్వదించి తమ తమ లోకములకు ఏగిరి. తరువాత అంజనాదేవి కూడా పరమానందముతో తన కుమారునితో కలిసి శ్రీవేంకటగిరినుండి తన ఆశ్రమునకు చేరెను.

ఈ విషయము సంగ్రహముగా స్కాందపురాణములోని శ్రీవేంకటాచలమాహాత్మ్య మునందు చెప్పబడినది.

AJTA పత్రసంఖ్య 6.7.8 మరియు 9 మొదటి పుటవిమర్శ

1.ఇంతకు ముందు ఉల్లేఖించిన పురాణముల ప్రకారము అంజనా అనునది ఎవరు ? ఆమె గౌతమమహర్షియొక్క పుత్రికనా ? లేక కేసరీ అను రాక్షసునియొక్క పుత్రికనా ? లేక రామాయణములో చెప్పినట్టుగా కుంజర అను వానరముయోక్క పుత్రికనా ?

2.అంజనాదేవి కామరూపిణియై సుందరమైన రూపమును ధరించి విహారము చేయునపుడు వాయుదేవుడు మొహించెనా ? లేక వాయువుయొక్క ప్రసంగమే లేకుండా సప్తర్షులు గౌతమమహర్షియొక్క పుత్రికి అయిన అంజనా చెవిలో శివతేజస్సును ఉంచిరా ? లేక అంజనాదేవి మతంగ మునియొక్క ఆదేశానుసారము తపస్సు చేసి వాయుదేవుని ప్రసన్నము గావించెనా ? లేక కొరవంజి చెప్పినట్టు తీవ్రమైన తపస్సు చేసి వాయుదేవుని అనుగ్రహముతో శివతేజస్సుతో కూడిన ఫలమును ఆరగించెనా ?

3.ఈ భాగమును విమర్శించే మొదలు ఇదే AJTA[9] నందు తి.తి.దే వారు ఉల్లేఖించిన వ్యాసులవారి వచనములను ధృఢపరుచుట అనునది ఉచితము.

कृते वृषाद्रिं वक्ष्यन्ति त्रेतायामञ्जनाचलम्। द्वापरे शेषशैलेति कलौ श्रीवेङ्कटाचलम्।।

అయ్యా తి.తి.దే వారు పైన ఉదహరించిన అర్థమును పురాణమునకు అనుగుణముగా అర్థము చెబుతున్నపుడు నాలుగు యుగములయందు ఒకే పర్వతమునకు క్రమముగా నాలుగు పేర్లు వచ్చినట్టు తెలుస్తున్నది.

1.    [10]కృతయుగమున వృషాసుర అథవా వృషభాసురుని యొక్క తపస్సుకి మెచ్చి ఆతని అపేక్షమేరకు[11] శ్రీనివాసుడు ఆతని పేరుతో ఈ పర్వతానికి వృషాచల అథవా వృషభాచల అను పేరును అనుగ్రహించెను.

[12]త్రేతాయుగమునందు వృషాచలము అథవా [13]వృషభాచల అను ప్రసిద్ధిగాంచిన పర్వతమునందు అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుడిని పుత్రినిగా పొందడం వలన ఈ పర్వతానికి త్రేతాయుగములో అంజనాచల అను నామము వచ్చినది.

[14]ద్వాపరయుగమున వాయుదేవునికి అలాగే ఆదిశేషుడికి జరిగిన స్పర్ధయందు వాయుదేవుని ప్రభావముచే  [15]మేరువు యోక్క కుమారుడైన ఆనందగిరి యు 50000 యోజన దూరములు ఎగిరి స్వర్ణముఖి అను నదియొక్క ఉత్తరదిగ్భాగమున నిలిచెను. [16]అపుడు శేషుడు క్షమా యాచించగా వాయుదేవుడు ఆతనిని సమాధాన పరచి ఇక ముందు ఈ పర్వతము నీ పేరుతో శేషాచలముగా ప్రసిద్ధి కాగలదు. ఇది అంతయూ ఆ భగవంతుని లీలావినోదము. [17]భవిష్యత్ కాలములో ఆ పరమాత్మ ఈ పర్వతము పైన స్థిరముగా నుండును అని అనుగ్రహించెను.

[18]కలియుగమునందు భగవంతుడు స్వయముగా భూమిపైన వేంచేసినందువలన, ఆ [19]పరమాత్ముని సంకల్పము చేత ఈ పర్వతమును తన ప్రమేయము లేకుండా అధిరోహించినపుడు మహాపాపి అయినటువంటు మాధవ అనబడు బ్రాహ్మణుడు తన సకలవిధములైన పాపములనుండి విముక్తి పొందినందువలన ఈ పర్వతమునకు [20]వేంకటాచలమని పేరు వచ్చినది.

కాబట్టి ఇతః పూర్వం [21]కొరవంజి చెప్పినట్టు, లేదా [22]మతంగ మహర్షి త్రేతాయుగమునందు అంజనాదేవికి నీవు వృషభాచలమునందు తపస్సును ఆచరించు అని చెప్పినపుడు ద్వాపరమున శేషాద్రి అని కాని, కలియుగమున వేంకటగిరి అని కాని ఆ పర్వతమును సంబోధించినట్లు అయితే ఎంత సముచితముగా ఉండేది, ప్రాయః వేదవ్యాసులవారికి ఈ పర్వతముయొక్క పేరు యందు ఏదో సందేహము కలిగి ఉండవచ్చో ఏమో అన్నట్టుగా ఉంది తి.తి.దే వారి వ్యవహారము.

ఈ విభాగమునందు నానావిధములైన సమస్యలు సృష్టించబడ్డాయి, వాటిలో కొన్నింటిని ఇక్కడ ఉదాహరిస్తున్నాము.

ద్వాపరమున వాయు-శేషుల మధ్య జరిగిన యుద్ధమునందు స్వర్ణముఖినదియొక్క [23]ఉత్తరభాగమున నెట్టివేయబడ్డ మేరుపర్వతముయోక్క కుమారుడైన ఆనందగిరి ప్రస్తుతం శ్రీనివాసునియోక్క నివాసస్థానముగా ఉన్నది. అన్న విషయము వాస్తవము అయితే మరి స్వర్ణముఖినదియొక్క ఉత్తరభాగమునందు ఇంతకు ముందు ఉన్న వృషభాచలము ఏమిటి, త్రేతాయుగమునందు అంజనాచలము అని ప్రసిద్ధిగాంచిన పర్వతము ఏమిటి, వేంకటాచలపర్వతము ఈ [24]వృషభాచల-అంజనాచల పర్వతములు వేరు వేరుగా ఉన్నవా, లేకా రెండూ ఒకటేనా, అన్న సంశము మీకు కలుగలేదా,

వృషభాచలము, వేంకటాచలము వేరు వేరుగా ఉన్నవి కాబట్టి స్వామిపుష్కరిణీ ఆకాశగంగా వీటిలో దేనికి సంబంధించినదో నిర్ణయించడం ముఖ్యము కదా, కలియుగ వేంకటాచలము, మరియు త్రేతాయుగమున అంజనాదేవి తపస్సు చేసిన పర్వతము వేరు వేరు అని అనేక ప్రమాణముల ద్వారా సామాన్య పామరులకు తెలిసిన విషయము. కాబట్టి వృథా కల్పితకథలను తమకు తోచిన రీతిలో చెప్పడం సబబు కాదు.

ఆంజనేయుడు సూర్యుడిని మింగడానికి వెళ్లినపుడు ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము గాయపరిచెనా, లేక బ్రహ్మదేవుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రము గాయపరిచెనా, వీటిలో దేనివలన ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు వచ్చినదో స్పష్టత లేదు, లేక ఇంతక ముందు చెప్పినట్టు పుట్టుకతోనో ఆంజనేయుడు ముఖము మరియు వాలము రక్తవర్ణముగా ఉండుటచే  ఆతని బలపరాక్రమము చేత హనుమంతుడు అని ప్రసిద్ధిగాంచెను, అన్న విషయము కూడా స్పష్టముగా లేదు. ఈ ప్రశ్నలేమీ తి.తి దే వారికి కలుగనే లేదా,  తమకు తోచిన తమకు కావలసిన వాక్యవిన్యాసములచే  ఈ విధమైనటువంటి అప్రామాణికమైన విషయమును సమాజమునకు అందించడం సముచితమేనా,

AJTA పత్రసంఖ్య 6 విమర్శ

ఈ విషయము సంగ్రహంగా స్కాందపురాణంలోని శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో చెప్పబడింది అని వచనమాత్రముగా పల్కి స్కాందపురాణముయోక్క ఉల్లేఖమును ఎక్కడా చేయలేదు. ప్రస్తుతానికి అనుపయుక్తమైన విషయవిస్తారమువలన ఎటువంటి ఉపయోగమూ లేదు.

चतुर्षु मेरुपार्श्वेषु हेमकूटहिमाह्वये। नीले श्वेतनगे चैव निषधे गन्धमादने।।

(ब्रह्माण्डपु.मध्यभाग.अ. 7-194)

ఇక్కడ సుమేరువుని  హనుమంతునియోక్క జన్మస్థానముగా చెప్పడం జరిగినది.  అలాగే శ్రీమద్రామాయణము నందు శ్రీరాముడు ఆసక్తితో  అగస్త్యమహర్షిని అడిగి హనుమంతుని జన్మవృత్తాంతమును తెలుసుకుంటాడు.

सूर्यदत्तवरस्वर्णः सुमेरुर्नाम पर्वतः।

यत्र राज्यं प्रशास्त्यस्य केसरी नाम वै पिता।। (रामायणम्. उ.का.19 अ.35)

ఈ బ్రహ్మాండపురాణమునందు రామాయణమునందు ప్రతిపాదించిన సుమేరు పర్వతము వేంకటాచలపర్వతమే అని ఇదే పురాణమునందు మరియొక చోట స్పష్టముగా చెప్పబడినది. मेरुपुत्रं महापुण्यं  वेङ्कटाचलसञ्ज्ञकम् అని మేరుపర్వతపుత్రునిగా, వేంకట అని ఉల్లేఖించడం జరిగినది. ఆ సుమేరు పర్వతము శేషుని అంశగా జన్మించినది. ఆ పర్వతము ఋషులకు, దేవతలకు, ముక్తులకు బంగారు వర్ణములో గోచరిస్తుంది. అని వేంకటేశమాహాత్మ్యము నందు వివరించడం జరిగినది. ఈ సత్యమును అన్నమయ్య తన అనేక పద్యములయందు వివరించాడు.

ఆంజనేయుని జన్మస్థలముగా చెబుతున్న భారతదేశము యోక్క మరికొన్ని పుణ్యక్షేత్రములను పరిశీలించిన తరువాత వాటియందు ఏ ఒక్క క్షేత్రమును హనుమంతుని జన్మస్థళము అని చెప్పుటకు సరి అయిన ప్రమాణవాక్యములు ఉపలబ్ధిగా లేవు.

ఇక్కడ పొందు పరిచిన కొన్ని రామాయణ వాక్యములు సుమేరు పర్వతమే వేంకటాచలమని స్పష్టముగా ప్రతిపాదించినప్పటికి  అది కేసరి యొక్క రాజధానిగా చెప్పబడినదే కాని, హనుమంతుని జన్మస్థలము కాదు.

यदि वाऽस्ति ह्यभिप्रायस्तच्छ्रोतुं तव राघव।

समाधाय मतिं राम निशामय वदाम्यहम्।। 17।।

सूर्यदत्तवरस्वर्णः सुमेरुर्नाम पर्वतः।

यत्र राज्यं प्रशास्त्यस्य केसरी नाम वै पिता।। 19।।

तस्य भार्या बभूवैषा ह्यञ्जनेति परिश्रुता।

जनयामास तस्यां वै वायुरात्मजमुत्तमम्।। 20।। (रामायणम् उ.का 35-18 तः 20)

ఎక్కడ నుండి కేసరి రాజ్యపాలన చేసేవాడో అది సుమేరు అని రామాయణవచనము. కాబట్టి కురవంజి చెప్పినట్టో, లేక మతంగమహర్షి సూచించినట్టో, అంజనా తపస్సు కొరకు వెళ్లిన ప్రదేశము అది కాదు అన్న విషయము సామాన్యులకు కూడా బోధపడుతుంది. కాబట్టి హనుమంతుని జన్మస్థలము సుమేరు అను వచనములో ప్రామాణ్యము లేదు. ఒకవేళ సుమేరువుని హనుమంతుని జన్మస్థలముగా అంగీకరిస్తే అపుడు వేంకటాచలము అంజనాద్రి కాదు అనుట అనివార్యమగును.

ఉపసంహారము

మిగిలిన క్షేత్రములు హనుమంతుని జన్మస్థలము అను విషయములో అబాధితమైన మహత్వపూర్ణమైన ప్రమాణములు ఉన్నవో లేవో తెలియదు కానీ, ప్రస్తుతానికి తిరుమల హనుమంతుని జన్మస్థలము అను విషయములో  అబాధితమైన స్పష్టమైన ప్రమాణములు లేవు అనునది స్పష్టమైనది.

ఏ ప్రమాణములను తి.తి.దే వారు ఉదాహరించి తిరుమల హనుమంతుని జన్మస్థళము అని నిరూపించుటకు ప్రయత్నించిరో, వాటియందు కలిగిన ఆక్షేపములకు స్పష్టమైన సహేతుకమైన సమాధానము చెప్పనంతవరకు అవన్నియూ కూడా కల్పితములుగానే పరిగణించబడును.

చివరిగా ఒక మాట

పురాణములకు అర్థాలను ఇదమిత్థం అని చెప్పడం సాహసమే. పురాణముల పరిశుద్దపాఠము చాలా కష్టసాధ్యము. విషయనిర్ధారణ చేసేటపుడు పురాణములను ప్రమాణములుగా ఉదాహరించు వేళ పౌర్వాపర్యములను ఆలోచించి పురాణవాక్యములను ఉదాహరించవలెను. లేనిచో ఈ విధముగా భంగపాటుకు లోనవడం తథ్యం. ఈ విషయమును తి.తి.దే వారు గ్రహించవలెను.

మూడు భాషలను, సప్తభేదములను, శతాధిక రీతులను తెలియని వ్యక్తి పురాణములకు అర్థనిరూపణ చేసినచో నరకాన్ని పొందడం సత్యం.

శ్రీకృష్ణార్పణమస్తు



[1]  ఈ శీర్షిక పేరులోనే  చాలా సందేహాలు దాగియున్నవి. శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థళము తిరుమలలోని అంజనాద్రి.

[2]  ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని శోధించి రచించిన వారు ఎవరో కాని, వారి పేరు ఈ సంచికలో ఉల్లేఖించే సాహసం మాత్రం చేయలేదు.కాబట్టి తి.తి.దే వారు ఉల్లేఖించినట్టే భావిస్తున్నాము. వారికే మా ప్రశ్నలను సంధానిస్తున్నాము.

[3] రామాయణము అను పేరుతో అనేక గ్రంథములు ఉపలబ్ధిగా ఉన్నాయి, వాటన్నిటికీ మూలం వాల్మీకి రామాయణం అనే అంశం చాలా ముఖ్యమైనది.లేనిచో రామాయణం పేరుతో భవిష్యత్తులో పుట్టుకొచ్చే అన్ని గ్రంథములను ప్రమాణముగా అంగీకరిస్తే మహా అనర్థము సంభవించగలదు. రామాయణంలో ఏ పాత్రలను అయితే శ్రీరాముడు, సీతామాతా, లక్ష్మణుడు, హనుమంతుడు, మొదలైనవాటిని మనం ఆదర్శముగా భావిస్తున్నామో వాటి అన్నిటినీ తలక్రిందులుగా మార్చే అవకాశములు చాలానే ఉన్నాయి. కాబట్టి ఆధునిక సాహిత్యమును వేద, రామాయణ, మహాభారత,అష్టాదశపురాణములకు విరుధం కానంతవరకు ప్రమాణముగా అంగీకరించవచ్చు. అలా కాకుండా అన్నిటినీ ప్రమాణముగా స్వీకరిస్తే, సనాతన సంస్కృతికి అపాయము కలుగుట సత్యము. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు.

[4] अप्सराप्सरसां श्रेष्ठा विख्याता पुञ्जिकस्थला। अञ्जनेति परिख्याता पत्नी केसरिणो हरेः।। 8।। अभिशापादभूत्तात वानरी कामरूपिणी। दुहिता वानरेन्द्रस्य कुञ्जरस्य महात्मनः।। 9।। कपित्वे चारुसर्वाङ्गी कदा चित्कामरूपिणी। मानुषं विग्रहं कृत्वा यौवनोत्तमशालिनी।। 10।। अचरत्पर्वतस्याग्रे प्रावृजम्बुदसन्निभे। विचित्रमाल्याभरणा महार्हक्षौमवासिनी।। 11।। तस्या वस्त्रं विशालाक्ष्याः पीतं रक्तदशं शुभम्। स्थितायाः पर्वतस्याग्रे मारुतोऽपहरच्छनैः।। 12।। स ददर्श ततस्तस्या वृत्तावूरू सुसंहतौ। स्तनौ च पीनौ सहितौ सुजातं चारु चाननम्।। 13।। तां विशालायतश्रोणीं तनुमध्यां यशस्विनीम्। दृष्ट्वैव शुभसर्वाङ्गीं पवनः काममोहितः।। 14।। स तां भुजाभ्यां पीनाभ्यां पर्यष्वजत मारुतः। मन्मथाविष्टसर्वाङ्गो गतात्मा तामनिन्दिताम्।। 15।। सा तु तत्रैव सम्भ्रान्ता सुवृत्ता वाक्यमब्रवीत्। एकपत्नीव्रतमिदं को नाशयितुमिच्छति।। 16।। अञ्जनाया वचः श्रुत्वा मारुतः प्रत्यभाषत। न त्वां हिंसामि सुश्रोणि मा भूत्ते सुभगे भयम्।। 17।। मनसास्मि गतो यत्त्वां परिष्वज्य यशस्विनि। वीर्यवान्बुद्धिसम्पन्नः पुत्रस्तव भविष्यति।। 18।। अभ्युत्थितं ततः सूर्यं बालो दृष्ट्वा महावने। फलं चेति जिघृक्षुस्त्वमुत्प्लृत्याभ्यपतो दिवम्।। 19।। शतानि त्रीणि गत्वाथ योजनानां महाकपे। तेजसा तस्य निर्धूतो न विषादं ततो गतः।। 20।। तावदापततस्तूर्णमन्तरिक्षं महाकपे। क्षिप्तमिन्द्रेण ते वज्रं क्रोधाविष्टेन धीमता।। 21।। ततः शैलाग्रशिखले वामो हनुरभज्यत। ततो हि नामधेयं ते हनुमानिति कीर्त्यते।। 22।। ततस्त्वां निहतं दृष्ट्वा वायुर्गन्धवहः स्वयम्। त्रैलोक्ये भृशसङ्क्रुद्धो न ववौ वै प्रभञ्जनः।। 23।। सम्भ्रान्ताश्च सुराः सर्वे त्रैलोक्ये क्षुभिते सति। प्रसादयन्ति सङ्क्रुद्धं मारुतं भुवनेश्वराः।। 24।। प्रसादिते च पवने ब्रह्मा तुभ्यं वरं ददौ। अशस्त्रवध्यतां तात समरे सत्यविक्रम।। 25।। वज्रस्य च निपातेन विरुजं त्वां समीक्ष्य च। सहस्रनेत्रः प्रीतात्मा ददौ ते वरमुत्तमम्।। 26।। स्वच्छन्दतश्च मरणं ते भूयादिति वै प्रबो। स त्वं केसरिणः पुत्रः क्षेत्रजो भीमविक्रमः।। 27।। मारुतस्यौरसः पुत्रस्तेजसा चापि तत्समः। त्वं हि वायुसुतो वत्स प्लवने चापि तत्समः।। 28।। वयमद्य गतप्राणा भवानस्मासु साम्प्रतम्। दाक्ष्यविक्रमसम्पन्नः पक्षिराज इवापरः।। 29।। त्रिविक्रमे मया तात सशैलवनकानना। त्रिः सप्तकृत्वः पृथिवी परिक्रान्ता प्रदक्षिणम्।। 30।। तदा चौषधयोऽस्माभिः सञ्चिता देवशासनात्। निष्पन्नममृतं याभिस्तदासीन्नो महद्बलम्।। 31।। स इदानीमहं वृद्धः परिहीनपराक्रमः। साम्प्रतं कालमस्माकं भवान्सर्वगुणान्वितः।। 32।। तद्विजृम्भस्व विक्रान्तः प्लवताम् उत्तमो ह्यसि। त्वद्वीर्यं द्रष्टुकामेयं सर्वा वानरवाहिनी।। 33।। उत्तिष्ठ हरिशार्दूल लङ्घयस्व महार्णवम्। परा हि सर्वभूतानां हनुमन्या गतिस्तव।। 34।। विषण्णा हरयः सर्वे हनुमन्किमुपेक्षसे। विक्रमस्व महावेगो विष्णुस्त्रीन्विक्रमानिव।। 35।। ततस्तु वै जाम्बवताभिचोदितः प्रतीतवेगः पवनात्मजः कपिः। प्रहर्षयंस्तां हरिवीर वाहिनीं चकार रूपं महदात्मनस्तदा।। 36।। (रामायण.किष्कि.66 सर्गः)

[5] माल्यवान्नाम वैदेहि गिरीणामुत्तमो गिरिः। ततो गच्छति गोकर्णं पर्वतं केसरी हरिः।। स च देवर्षिभिर्दिष्टः पिता मम महाकपिः। तीर्थे नदीपतेः पुण्ये शम्बसादनमुद्धरत्। तस्याहं हरिणः क्षेत्रे जातो वातेन मैथिलि।. (सु.का.35 सर्ग.80-83)

अहं केसरिणः क्षेत्रे वायुना जगदायुषा। जातः कमलपत्राक्ष हनूमान्नाम वानरः।. म.भा वान-147-27

[6]  एकस्मिन् समये शम्भुरद्भुतोतिकरः प्रभुः। ददर्श मोहिनी रूपं विष्णोस्सहि वसद्गुणः।। 3।।

चक्रे स्वं क्षुभितं शम्भुः कामबाणहतो यथा। स्वं वीर्यं पातयामास रामकार्यार्थमादरात्।। 4।।

तैर्गोतमसुतायां तद्वीर्यं शम्भोः महर्षिभिः कर्णद्वारा तथाञ्जन्यां रामकार्यार्थमाहितम्।। 5।।

ततश्च समये तस्माद्धनूमानिति नामभाक्। शम्भुर्जज्ञे कपितनुः महाबलपराक्रमः।। 6।। (शिव पु शतरुद्र अ 20)

[7]  ముందు భాగములో ఇదే శ్లోకమును పాదవ్యత్యాసముతో ఉల్లేఖించియున్నారు. ఇటువంటి సూక్ష్మమైన విచారమును చేయునపుడు తి.తి.దే వారు అత్యంత జాగ్రత్తవహించి ప్రమాణశ్లోకములను ఉల్లేఖించి ఉంటే బాగుండేది.

[8]  ఇదే ప్రసంగమును వర్ణించు భవిష్యోత్తర పురాణమునందున శ్రీవేంకటేశమాహాత్మ్యము నందు శివతేజస్సుని గూర్చిన ప్రస్తావనే లేదు. అంతేకాదు ఇక్కడ వేంకటగిరియొక్క ప్రసక్తి కూడా లేదు. फलमाहृत्य भक्ष्यार्थं प्रत्यहं ह्यददान्मरुत्।। 88।। अथैकस्मिन् दिने वायुः फले वीर्यमपूरयत्।। अञ्जना व्रतमास्थाय पुत्रं प्राप गिरीश्वरे।। तस्मादञ्जनशैलोऽयं लोके विख्यातकीर्तिमान्।। श्री भविष्योत्तरपुराणे. श्रीवेङ्कटाचलमाहात्म्यम् अ.1

[9]  AJTA పత్రసంఖ్య 5.

[10]  कृते वृषाद्रिं वक्ष्यन्ति त्रेतायामञ्जनाचलम्। द्वापरे शेषशैलेति कलौ श्रीवेङ्कटाचलम्।। नामानि युगभेदेन शैलस्यास्य भवन्ति हि।

चतुर्युगे त्वया प्रोक्तं नाम यद्यद्गिरेर्मुने। तस्य तस्य च वै हेतुं विस्तराद्वद मे गुरो। कृते वृषाचल इति कथं नाम भविष्यति।। (श्रीभविष्योत्तरपुराणे. श्रीवेङ्कटाचलमाहात्म्यम् अ.1-36 तः 38)

[11]  वरं ययाचे वृषभः शैलो मदभिधोऽस्त्विति।। 64।। (श्रीभविष्योत्तरपुराणे. श्रीवेङ्कटचालमाहात्म्यम् अ.1)

[12]  कथमञ्जनशैलेति त्रेतायां नाम मे वद।। 66।। (श्रीभविष्योत्तरपुराणे. श्रीवेङ्कटचालमाहात्म्यम् अ.1)

[13]  మతంగిమహర్షియొక్క వచనానుసారము ఈ పర్వతమునందే స్వామిపుష్కరిణీ మరియు ఆకాశగంగ ఉన్నట్టుగా చెబుతుంది AJTA పత్రసంఖ్య 12.

इतो दक्षिणदिग्भागे दशयोजनदूरतः। घनाचल इति ख्यातो नृसिंहस्य निवासभूः।। तस्योपरि महाभागे ब्रह्मतीर्थं मनोरमे। तस्यापि पूर्वदिग्भागे दशयोजनमात्रतः।। सुवर्णमुखरी नाम नदीनां प्रवरा नदी। तस्या एवोत्तरे भागे वृषभाचलनामतः।। तस्याग्रे सरसी नाम्ना स्वामिपुष्करिणी शुभा। गत्वा दृष्ट्वा शुभं तोयं मनःशुद्धिं गमिष्यसि।। तत्र स्नात्वा विधानेन वराहं तं प्रमण्य च। वेङ्कटेशं नमस्कृत्य ततो गच्छ वरानने।। (वेङ्कटाचलमाहात्म्यम् स्कन्दपुराणं वैष्णवखण्डः 1.28)

 అయితే మతంగమహర్షియొక్క వచనములు భవిష్యోత్తర పురాణమున వేంకటేశమాహాత్మ్యమునందు ఈ విధముగా కనబడుచున్నవి. वेङ्कटेशं नमस्कृत्य ततो गच्छ वरानने అను మాట ఇక్కడ లేదు.

            पम्पायाः पूर्वदिग्भागे पञ्चाशद्योजनान्तरे। नरसींहाश्रमं देवि वर्तते वसुधातले।। 70।। तस्य दक्षिणदिग्भागे नारायणगिरेस्तटे। उत्तरे स्वामितीर्थस्य वर्तते क्रोशमात्रके।। 71।। वियद्गङ्गेति विख्याता तत्र गच्छ यथासुखम्।। तत्र स्नात्वाथ कल्याणि द्वादशाब्दं तपश्चर।। 72।। तेन पुण्येन ते पुत्रो भविष्यति गुणाधिकः।। मतङ्गेनैवमुक्ता सा नारायणगिरिं ययौ।। 73।। फलमाहृत्य भक्ष्यार्थं प्रत्यहं ह्यददान्मरुत्।। 77।। (श्रीभविष्योत्तरपुराणे. श्रीवेङ्कटचालमाहात्म्यम् अ.1)

[14]  द्वापरे शेषशैलेति कथं ख्यातिर्भविष्यति।। 82।। श्रीभविष्योत्तरपुराणे. श्रीवेङ्कटचालमाहात्म्यम् अ.1

[15] अत्रैवोत्तरदिग्भागे पर्वतं मेरुनन्दनम्। स्वकायरज्जुना बद्ध्वा बलं ते यावदस्ति हि।। 105।। स्वकायरज्जुना बद्धन् आनन्दाद्रिमहेश्वरः।। 107।। श्रीभविष्योत्तरपुराणे. श्रीवेङ्कटचालमाहात्म्यम् अ.1

[16]  स्वर्णमुख्या महानद्याः प्रतीरे च तथोत्तरे। स्थापयामास राजेन्द्र गिरिराजं सपन्नगम्।। 118।। हरेः सञ्जोदनेनैव जातः स्वाऽवासहेतवे।। व्याजेनैव त्वयाऽनीतः तेन स्वर्णमुखीतटम्।। 120।। इत्थं शेषांशजं शैलं शेषेण परिवेष्टितम्।। 126।।( श्रीभविष्योत्तरपुराणे. श्रीवेङ्कटचालमाहात्म्यम् अ.1)

[17] स्वावासहेतोर्हिरिणा वाहितं वायुना छलात्।। राजन् शेषनिमित्तेन शेषाचलमिमं विदुः।। 127।। श्रीभविष्योत्तरपुराणे. श्रीवेङ्कटचालमाहात्म्यम् अ.1

[18] कलौ वेङ्कटशैलेति कथं नाम महामुने।। 128।। श्री भविष्योत्तरपुराणे. श्रीवेङ्कटाचलमाहात्म्यम् अ.1

[19]  यदा गता महालक्ष्मीः तदा नारायणो हरिः।। आविंशतितमे (अष्टाविंशतितमे) प्राप्ते द्वापरान्ते कलौयुगे।। 38।। मायावी परमानन्दं त्यक्त्वा वैकुण्ठमुत्तमम्।। गङ्गाया दक्षिणे देशे योजनानां शतत्रये।। 40।। सुवर्णमुखरी नाम नदीनां प्रवरा नदी।। शुकस्य वरदा पुण्या ह्यगस्त्यमुनिपूजिता।। 41।। तस्या एवोत्तरे तीरे क्रोशार्धद्वयमात्रके।। श्रीवेङ्कगिरिर्नाम वर्तते पुण्यकाननः।। 42।।  सुवर्णगिरिपुत्रस्तु सर्वतीर्थसमन्वितः।। साक्षाच्छेषावतारोऽसौ सर्वधानुविराजितः।। 43।। वैकुण्ठसदृशो दिव्यो नारायणसमाश्रयः।। शेषमारुतसंवादादागतः पुण्यकाननः।। 44।। श्री भविष्योत्तरपुराणे श्री वेङ्कटाचलमाहात्म्यम् अ.1

[20] तेषामनुपदं राजन्! प्राप शेषगिरिश्च सः। विश्राम्यन्तः सर्व एव ते तस्थुस्तत्र तत्र च।। 206।। सोऽपि तस्थौ महाराजा माधवो गिरिमस्तके।। भूधरस्पर्शमात्रेण तदधं पर्यकम्पत।। 207।। तदा नाम चकाराद्रेः वेङ्कटाचल इत्यपि। सर्वपापानि वें प्राहुः कटः तद्दाह इत्यपि।। 220।। श्री भविष्योत्तरपुराणे श्रीवेङ्कटाचलमहात्म्यम् अ.1

 

[21] श्रीवेङ्कटगिरौ सप्त साहस्रं वत्सरान् पुनः।। (ब्रह्माण्ड.पु.वेङ्कटाचलमाहात्म्यम् तीर्थखण्ड अ.5-16 AJTA పత్రసంఖ్య 7)

अञ्जने त्वं हि शेषाद्रौ तपस्तपत्वा सुदारुणम्।। (ब्रह्माण्ड.पु.वेङ्कटाचलमाहात्म्यम् तीर्थखण्ड अ.5-64 AJTA పత్రసంఖ్య 7)

 

[22] वेङ्कटेशं नमस्कृत्य ततो गच्छ वरानने। .(वेङ्कटाचलमाहात्म्यम्-स्कान्दपुराणं वैष्ण्वखण्डः अ.1-38 AJTA పత్రసంఖ్య 12)

 

[23] सुवर्णमुखरी नाम नदीनां प्रवरा नदी। तस्या एवोत्तरे भागे वृषभाचलनामतः।। (वेङ्कटाचलमाहात्म्यम्-स्कान्दपुराणं वैष्ण्वखण्डः अ.1-38 AJTA పత్రసంఖ్య 12)

[24] मत्वेदं परमं स्थानं तत्र लीनोऽभवद्धरिः।। एवं देवे स्थिते तत्र विगतं वत्सरायुतम्।। 14।। अतीते द्वापरे चैव त्वष्टाविंशतिमे कलौ।। अतीते वत्सरे कश्चित् चोलराजो नृपोत्तमः।। 15।। श्रीभविष्योत्तरपुराणे, श्रीवेङ्कटाचलमाहात्म्यम् अ.3

सुवर्णमुखरी नाम नदीनां प्रवरा नदी।। शुकस्य वरदा पुण्या ह्यगस्त्यमुनिपूजिता।। 41।। तस्या एवोत्तरे तीरे क्रोशार्धद्वयमात्रके।। श्रीवेङ्कटगिरिर्नाम वर्तते पुण्यकाननः।। 42।। सुवर्णगिरिपुत्रस्तु सर्वतीर्थसमन्वितः।। साक्षाच्छेषावतारोऽसौ सर्वधातुविराजितः।। 43।। वैकुण्ठसदृशो दिव्यो नारायणसमाश्रयः।। शेषमारुतसंवादादागतः पुण्यकाननः।। 44।। योजनत्रयविस्तीर्णः त्रिंशद्योजनमायतः।। वदनं वेङ्कटगिरिः नृसिंहाद्रिश्च मध्यमः।। 45।। शीशैलः पुच्छभागस्थः सर्वक्षेत्रमयोगिरिः।। एवं प्रभावोऽस्य गरिन्द्रजन्मनः श्रीवेङ्कटाद्रेस्तु हरेस्थथैव।। जानन्ति न ब्रह्मशिवेन्द्रपूर्वकाः अत्यल्पवीर्याः मनुजास्तु किं पुनः।।

Popular posts from this blog

ಬ್ರಾಹ್ಮಣ್ಯ ಮತ್ತು ಭಾರತ